ఏపీలో కొత్తగా 443 మందికి కరోనా నిర్ధారణ, 111 కి చేరిన మరణాలు

SSC 2020 Grades, telangana, Telangana SSC 2020 Grades, Telangana SSC Grades, Telangana SSC-2020 Students Grades Released, TS SSC 2020 Marks Memo, TS SSC 2020 Marks Memo Download, TS SSC Results 2020, TS SSC Results 2020 Marks Memo

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 443 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 392 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 44, విదేశాల నుంచి వచ్చిన వారు ఏడుగురు ఉన్నారు. కొత్తగా నమోదైన 443 కేసులతో కలిపి జూన్ 22, సోమవారం ఉదయానికి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 9372 కు చేరింది. గత 24 గంటల్లో 16704 సాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు. ఈ కేసుల్లో 7451 రాష్ట్రంలో నమోదుకాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు మరియు విదేశాల నుండి వచ్చిన వారు 1921 మంది ఉన్నారు.

మరోవైపు కృష్ణా, కర్నూల్, అనంతపూర్, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాలలో ఒక్కొక్కరు మరణించడంతో ఈ వైరస్ వలన రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 111 కి చేరింది. ఇక రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల్లో ఇప్పటికి 4435 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం 4826 మంది చికిత్స పొందుతున్నారు.

ఏపీలో జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య:

  • అనంతపూర్ – 870
  • చిత్తూరు – 591
  • కర్నూల్ – 1354
  • కడప – 430
  • తూర్పుగోదావరి – 619
  • పశ్చిమ గోదావరి – 604
  • నెల్లూరు – 477
  • ప్రకాశం – 187
  • గుంటూరు – 802
  • కృష్ణా – 1063
  • శ్రీకాకుళం – 59
  • విజయనగరం – 90
  • విశాఖపట్నం – 305
  • ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన వారు: 1584
  • విదేశాల నుంచి వచ్చిన వారు: 337

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu