ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 6.30 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కాగా మధ్యాహ్నం 12:30 గంటల వరకు 62% పోలింగ్ నమోదైనట్లు తెలుస్తుంది.
మొత్తం 12 జిల్లాల్లో 2,724 పంచాయతీలు, 20,157 వార్డుల్లో ఎన్నికల నిర్వహణ కోసం 29,732 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. ఇక కరోనా బాధితులు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు, ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 1:30 ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
మరోవైపు మొదటివిడత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానాల్లో 7,506 మంది, 20,157 వార్డులకు 43,601 మంది బరిలో నిలిచారు. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ పక్రియను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కరోనా నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్నికల సిబ్బందికి గ్లోజులు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కరోనా బాధితులు ఎక్కువుగా ఓటువేయడానికి వచ్చే కేంద్రాల్లో సిబ్బందికి పీపీఈ కిట్స్ అందుబాటులో ఉంచారు. పోలింగ్ అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు పక్రియను ప్రారంభించనున్నారు. ఫలితాల అనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక కూడా చేపట్టనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ