ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నీలం సాహ్ని డిసెంబర్ నెలాఖరుతో పదవి విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఏపీ కేబినెట్ సమావేశం అయిన సమయంలో సీఎస్ నీలం సాహ్నిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా సత్కరించారు. సీఎం జగన్ తో పాటుగా మంత్రులు, ఉన్నతాధికారులు ఆమెను సత్కరించారు. ముందుగా నవంబర్ 14, 2019 న ఏపీ సీఎస్ గా నీలం సాహ్ని పదవి బాధ్యతలు చేపట్టారు. విభజన అనంతరం ఏపీకి సీఎస్ గా బాధ్యతలు నిర్వహించిన తొలి మహిళగా ఆమె గుర్తింపు పొందారు. 1984వ ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఆమె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాలకు కలెక్టర్ గా, అసిస్టెంట్ కలెక్టర్గా, జాయింట్ కలెక్టర్గా కూడా పనిచేశారు. అలాగే పలు శాఖలకు వివిధ స్థాయిల్లో కార్యదర్శిగా విధులు నిర్వహించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న శ్రీమతి నీలం సాహ్ని ఈ నెలాఖరుతో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆమెను కేబినెట్ సమావేశంలో మంత్రి మండలి సత్కరించింది. ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ నేతృత్వంలో ఈ సత్కార కార్యక్రమం జరిగింది. pic.twitter.com/I8X4hdlTee
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) December 18, 2020
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ