ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 141 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కృష్ణాలో 41, పశ్చిమగోదావరిలో 23, గుంటూరులో 16, తూర్పుగోదావరిలో 16, చిత్తూరులో 12, అనంతపురంలో 12 నమోదయ్యాయి. దీంతో మార్చి 1, మంగళవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,17,953 కు, మరణాల సంఖ్య 14729 కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో 450 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 23,01,210 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,014 యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(141):
- కృష్ణా – 41
- పశ్చిమగోదావరి – 23
- గుంటూరు – 16
- తూర్పుగోదావరి – 16
- చిత్తూరు – 12
- అనంతపురం – 12
- విశాఖపట్నం – 7
- కడప – 5
- నెల్లూరు – 3
- ప్రకాశం – 3
- విజయనగరం – 2
- శ్రీకాకుళం – 1
- కర్నూల్ – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ