భారతదేశంలో గ్యాస్ సిలిండర్ ధరలు ఒక్కసారిగా పెరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. రష్యా – ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) ధరలు పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు నేటి నుంచి, అనగా.. 2022 మార్చి 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. 19 కేజీల సిలిండర్ పై అత్యధికంగా ఒకేసారి రూ. 105లు పెంచగా, 5 కేజీల సిలిండర్పై రూ. 27 వరకు పెంచాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణం, కరోనా మహమ్మారి కారణంగా దేశంలో దెబ్బతిన్న చిరు వ్యాపారులకు, స్ట్రీట్ఫుడ్ వెండర్స్కి, ఇప్పుడు తాజాగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల పెంపు కూడా తోడవటంతో బెంబేలెత్తిపోతున్నారు.
ఈ నేపథ్యంలో.. ఎల్పీజీ ధరల పెంపుపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మంగళవారం ప్రభుత్వంపై ట్విట్టర్లో తన స్పందనను తెలియజేశారు. ఎల్పీజీ ధరలను పెంచడం ద్వారా మోదీ ప్రభుత్వం సామాన్య ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని స్పష్టం చేసింది. ఈరోజు దేశంలో ఎల్పీజీ ధరలు పెరిగాయి. అలాగే, రేపు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయని భావిస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతుండటంతో గృహ వినియోగ సిలిండర్ ధరలు పెంచటానికి చమురు కంపెనీలు ధైర్యం చేయలేదు. అయితే, ఎన్నికల అనంతరం వీటి ధర కూడా పెరగొచ్చు అని వార్తలు వస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ