ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ వాయిదా పడింది. సెప్టెంబర్ 2 నుంచి 9 వరకు జరగాల్సిన పరీక్షలను ఏపీపీఎస్సీ వాయిదా వేసింది. అయితే ప్రిపరేషన్ కు మరింత సమయం కావాలని మెయిన్స్ అభ్యర్థుల నుంచి భారీ ఎత్తున ప్రభుత్వానికి విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 మెయిన్స్ వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహించనున్నారు అనే సవరించిన షెడ్యూల్ త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో 81 పోస్టుల భర్తీకి గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలై సంగతి తెలిసిందే.
మొత్తం 81 పోస్టుల భర్తీకి ఈ ఏడాది మార్చి 17న ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు మొత్తం 1,48,881 మంది దరఖాస్తు చేసుకోగా… 4,496 మంది మెయిన్స్ కు అర్హత సాధించారు. అయితే గ్రూప్-2 తరహాలో గ్రూప్-1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలన్న డిమాండ్ వినిపిస్తుంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు ఏప్రిల్ 12 విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 4,496 మంది మెయిన్స్ కు అర్హత సాధించారు. గతేడాది డిసెంబర్ లో విడుదలైన గ్రూప్ -1 నోటిఫికేషన్ లో భాగంగా… మొత్తం 81 ఉద్యోగాలను రిక్రూట్ చేయనుంది ఏపీపీఎస్సీ. సెప్టెంబర్ నెలల మెయిన్స్ పరీక్షలను నిర్వహించేందుకు ముందుగా నిర్ణయించినా…తాజాగా మెయిన్స్ వాయిదా వేసింది. ఏపీపీఎస్సీ గ్రూప్ -1 పోస్టుల భర్తీ కోసం మార్చి 17న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించింది.
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షా విధానం
మెయిన్స్ లో చూస్తే పేపర్ 1 జనరల్ ఎస్సేలు ఉంటాయి. మొత్తం 150 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. భారత దేశ చరిత్రకు సంబంధించి రెండో పేపర్ ఉంటుంది. దీనికి 150 మార్కులు కేటాయించారు. భారత రాజ్యంగం, గవర్నెర్స్ అని మూడో పేపర్ ఉంటుంది. దీనికి 150 మార్కులు కేటాయించారు. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి నాల్గో పేపర్ ఉండగా.. దీనికి కూడా 150 మార్కులు ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఐదో పేపర్ గా ఉండగా.. దీనికి కూడా 150 మార్కులు కేటాయించారు. ఇంగ్లీష్ , తెలుగు పేపర్లలో తప్పనిసరిగా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. మిగతా ఐదు పేపర్లలో నుంచి మెరిట్ ను తీసుకుంటారు.