వైసీపీకి గుడ్‌బై: జగన్‌పై అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు!

Avanthi Srinivas Quits YSRCP Blasts Jagan With Bold Criticism, Avanthi Srinivas Quits YSRCP, Bold Criticism, YSRCP Blasts, Andhra Pradesh, Avanthi Srinivas, Jagan Mohan Reddy, Politics, YSRCP, Andhra Pradesh, AP Live Updates, AP Politics, Political News, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి (వైసీపీ) గుడ్‌బై చెబుతూ, పార్టీ నేత జగన్‌పై కీలక విమర్శలు చేశారు. ‘‘జనాలు ఇచ్చిన తీర్పును గౌరవించడం నేతల బాధ్యత. పార్టీ ప్రజాస్వామ్య పద్ధతుల్లో నడవాలి. కానీ, తాడేపల్లిలో కూర్చుని ఆదేశాలు ఇస్తూ క్షేత్రస్థాయి కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేయడం సరైంది కాదు’’ అని అవంతి వ్యాఖ్యానించారు.

వైసీపీ, భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త పదవికి తన రాజీనామాను ప్రకటించిన అవంతి, తన నిర్ణయం వ్యక్తిగత కారణాలతో తీసుకున్నట్టు తెలిపారు. ‘‘కొంతకాలం రాజకీయాలకు విరామం తీసుకుంటాను. నేను ఎప్పుడూ సేవే నా లక్ష్యం అని భావించాను, సంపాదన నా అభిప్రాయం కాదు,’’ అని చెప్పారు.

ప్రజా సేవలో ఎప్పుడూ అవినీతికి ఆస్కారం ఇవ్వలేదని చెప్పిన అవంతి, కార్యకర్తలు, స్థానిక నాయకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధిలో లోపాలను సరిచేయాలని సూచించారు. ‘‘జగన్ ప్రభుత్వ తీరుతో కార్యకర్తలు, నేతలు నిరాశకు గురయ్యారు. కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా నిరసనలు చేపట్టడం సమంజసం కాదు,’’ అని ఆయన జగన్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు.