స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు అంతర్జాతీయ, దేశీయ కంపెనీల ప్రతినిధులతో వరుసగా సమావేశమవుతున్నారు. అందులో భాగంగా బుధవారం పలు యూనికార్న్ స్టార్టప్స్ వ్యవస్థాపకులు, సీఈఓలతో సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. సీఎంను కలిసిన వారిలో మీషో సీఈఓ విదిత్ ఆత్రేయ, బైజూస్ వైస్ ప్రెసిడెంట్ సుష్మిత్ సర్కార్, కాయిన్స్విచ్ క్యూబర్ వ్యవస్థాపకుడు, గ్రూప్ సీఈఓ ఆశిష్ సింఘాల్, ఈజీమై ట్రిప్ ప్రశాంత్పిట్టి, వీహివ్.ఏఐ వ్యవస్థాపకుడు సతీష్ జయకుమార్, కొర్సెరా వైస్ ప్రెసిడెంట్ కెవిన్ మిల్స్ ఉన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో విశాఖపట్నం సహా పలు ప్రాంతాల్లో స్టార్టప్స్ కార్యకలాపాలకై ప్రభుత్వం ప్రణాళికతో ఉందని, పెట్టుబడుల పెట్టేందుకు వారందరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీఎం వైఎస్ జగన్ ఆహ్వానం పలికినట్టు తెలుస్తుంది. మరోవైపు స్విట్జర్లాండ్లో వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ప్రవాసాంధ్రులు బుధవారం దావోస్ లో సీఎం వైఎస్ జగన్ను కలుసుకున్నారు. ఏపీలో చేపడుతున్న కార్యక్రమాలు బాగున్నాయని కితాబు ఇచ్చారు. అభివృద్ధి, సంక్షేమం, విద్యా, వైద్య రంగాల్లో చక్కటి కృషిచేస్తున్నారని, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని ప్రవాసాంధ్రులు కితాబు ఇచ్చినట్టు ఏపీ సీఎంఓ కార్యాలయం వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF