గండికోట అభివృద్ధికి కేంద్రం 77.91 కోట్ల నిధులు మంజూరు

Centre Approves Rs 77.91 Crore For Development Of Gandikota, Development Of Gandikota, Gandi Kota AP, Gandi Kota Development, AP Tourism Development, Centre Releases Funds To Gandikota, Gandikota Development, AP Tourism, CM Chandrababu, Andhra Pradesh, AP Live Updates, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

ఏపీలోని గండికోటను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం రూ. 77.91 కోట్ల నిధులను కేటాయించింది. ఈ నిధుల ద్వారా గండికోటను అమెరికాలోని గ్రాండ్ క్యానియన్ తరహాలో అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ బాధ్యతను కూటమి ప్రభుత్వం చేపట్టాలని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుందని గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.

గండికోట చరిత్రాత్మక వైభవాన్ని పునరుద్ధరించేందుకు, పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెమ్మసాని మంత్రి పర్యాటక మంత్రిత్వ శాఖకు గండికోట అభివృద్ధికి సంబంధించి 2023 నవంబర్ 4న లేఖ రాశారు. దీనికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం, ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా గండికోట ప్రాభవం, ప్రాశస్త్యం భవిష్యత్ తరాలకు తెలియజేయడానికి నిధులను మంజూరు చేసింది.

అంతేకాదు, గండికోట పరిసర ప్రాంతాలను కూడా పర్యాటక దృష్టికోణంలో అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఉద్దేశంతో కేటాయించిన నిధులను స్థానిక నదీ పరివాహక ప్రాంతాన్ని పర్యాటకంగా వినియోగించేందుకు ఉపయోగించనున్నారు. ఈ సందర్భంగా, పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, “కేంద్ర ప్రభుత్వం, పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు ఈ నిధుల మంజూరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను” అని పేర్కొన్నారు.