ఏపీలో వారికి ఉచిత విద్యుత్..

కూటమి ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ వినియోగానికి సంబంధించి చేనేత కార్మికులకు ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయాన్ని ప్రకటించింది. చేనేత కార్మికుల ఇళ్లకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని తాజాగా ఏపీ కేబినెట్లో నిర్ణయం తీసుకుంది. చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటును అందించే ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాదు పవర్ లూమ్స్ కు కూడా 500 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వాలనే ప్రతిపాదనలకు కేబినెట్ పచ్చ జెండా ఊపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ క్యాబినెట్ సమావేశం జరగగా.. ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదాన్ని తెలిపింది.

చేనేత కార్మికులకు ఆదుకోవడానిిక కూటమి ప్రభుత్వం ఎప్పడూ సిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. చేనేత రంగం మరింత అభివృద్ధి చెందేలా కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు కూడా తెలిపారు. దీనిలో భాగంగానే చేనేత కార్మికుల ఇళ్లకు ఉచితంగా కరెంటు ఇవ్వాలని ప్రతిపాదన చాలా రోజులుగా ఉంది. తాజాగా కేబినెట్ సమావేశంలో ఉచిత విద్యుత్ ఇవ్వడానికి ప్రతిపాదనను ఆమోదించారు. దీంతో ఇకనుంచి చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందుతుంది.ఇప్పటికే ఏపీలో ఎస్సీ ఎస్టీ, నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. తాజాగా సీఎం చంద్రబాబు నిర్ణయంతో ఇప్పుడు ఆ జాబితాలోకి చేనేత కార్మికులు వెళ్లనుండటంతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అలాగే క్యాబినెట్ సమావేశంలో కీలక ప్రతిపాదనలకు కూడా ఏపీ మంత్రివర్గం తమ ఆమోదాన్ని తెలిపింది. ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ చట్ట సవరణ బిల్లుకు కూడా మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతిలో భూ కేటాయింపులపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలకు కూడా ఆమోదం లభించింది. అలాగేఎస్సీ వర్గీకరణ పై రాజీవ్ రంజాన్ మిశ్రా కమిషన్ సమర్పించిన నివేదికకు ఏపీ కేబిననెట్ ఆమోదించింది. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో రెన్యువల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు కూడా మంత్రివర్గం నిర్ణయాన్ని తీసుకుంది.