సీఎం జగన్ రెండోరోజు కడప జిల్లా పర్యటన.. ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు

CM Jagan Pays Homage at YSR Ghat in Idupulapaya Today, CM Jagan 2nd Day of Kadapa Tour, Mango News, Mango News Telugu, CM YS Jagan Pays Tribute To YS Rajasekhara Reddy, Jagan Pays Tributes To YSR Ghat, YSR Ghat Idupulapaya, YSR Ghat, CM Jagan at idupulapaya, AP CM YS Jagan Latest News, AP Political News, CM Jagan Kadapa Tour, AP CM YS Jagan Pays Tributes To Dr YSR

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పర్యటన రెండో రోజైన శనివారం ఆయన తమ కుటుంబానికి చెందిన ఇడుపులపాయలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించారు సీఎం జగన్. ఇక నేడు తన పర్యటనలో భాగంగా సీఎం జగన్ కడప జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం విజయ హోమ్స్‌ జంక్షన్‌, కదిరి రోడ్డు జంక్షన్‌, విస్తరణ రోడ్డు, కూరగాయల మార్కెట్‌, మైత్రి లే అవుట్‌ మరియు రాయలాపురం వంతెనను ప్రారంభిస్తారు. ఆ తర్వాత పులివెందుల పట్టణంలో నూతనంగా నిర్మించిన డాక్టర్‌ వైఎస్సార్‌ ఆర్టీసీ బస్సు స్టేషన్‌ను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ కొద్దిసేపు ప్రజలనుద్దేశించి సీఎం జగన్ ప్రసంగిస్తారు. ఇక సాయంత్రం అహోబిలపురం స్కూలు అభివృద్ధి పనులు, ఎంఎల్డీ ఎస్టీపీ, జేటీఎస్‌ల ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =