తుఫాన్లతో నష్టం: ఎన్‌డిఆర్‌ఎఫ్ నుంచి 5 రాష్ట్రాలకు రూ.3,113.05 కోట్ల అదనపు సాయం

Centre Approves Rs 280.78 Crore to AP from National Disaster Response Fund

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఐదు రాష్ట్రాలకు రూ.3,113.05 కోట్ల అదనపు కేంద్ర సహాయానికి ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. 2020 వ సంవత్సరంలో నివర్, బురేవి తుఫాన్లతో పాటుగా పంటల్లో తెగులు కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బీహార్, పుదుచ్చేరి, మధ్యప్రదేశ్ రాష్ట్రాల కోసం ఈ నిధులను కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్‌డిఆర్‌ఎఫ్) నుంచి ఈ ఐదు రాష్ట్రాలకు రూ.3,113.05 కోట్ల సహాయాన్ని అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇందులో నైరుతి రుతుపవనాల కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రూ.280.76 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు.

కేంద్రం నుంచి అదనపు సాయం పొందిన రాష్ట్రాలివే:

  • నైరుతి రుతుపవనాల కారణంగా వచ్చిన వరదల వలన నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ‌కు రూ.రూ.280.76 కోట్లు.
  • నైరుతి రుతుపవనాల కారణంగా వచ్చిన వరదల వలన నష్టపోయిన బీహార్ ‌కు రూ.1,255.27 కోట్లు.
  • నివర్, బురేవి తుఫాన్లతో నష్టపోయిన తమిళనాడుకు రూ.286.91 కోట్లు.
  • నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి రూ.9.91 కోట్లు
  • ఖరీఫ్-2020 సందర్భంగా తెగులు వలన నష్టపోయిన మధ్యప్రదేశ్‌కు రూ.1,280.18 కోట్లు.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ