కరోనా నుంచి కోలుకుని ఒకే రోజులో 58,794 మంది డిశ్చార్జ్

India Corona Updates: 69,652 Positive Cases, 977 Deaths Reported in Last 24 Hours

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఆగస్టు 20, గురువారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 28,36,925 కు పెరిగింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 69,652 కరోనా పాజిటివ్ కేసులు, 977 కరోనా మరణాలు నమోదయ్యాయి. కరోనా వలన మరణించిన వారి మొత్తం సంఖ్య 53,866 కు చేరింది. కరోనా మరణాల రేటు 1.9 శాతంగా ఉండగా, కరోనా రికవరీ రేటు 73.09 శాతంగా ఉంది. మరోవైపు ఒకే రోజులో 58,794 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఈ రోజు వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20,96,664 కు చేరుకుంది.

ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఒకే రోజు వ్యవధిలో నమోదవుతున్న కరోనా కేసుల్లో భారత్‌లోనే ఎక్కువుగా నమోదవుతున్నాయి. దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాలలో కరోనా ప్రభావం అధికంగా ఉంది. మరోవైపు కరోనా మరణాలు ఎక్కువుగా నమోదవుతున్న దేశాల్లో భారత్‌ నాలుగో స్థానానికి చేరింది. అలాగే అత్యధిక కరోనా కేసులలో అమెరికా, బ్రెజిల్‌ దేశాల తర్వాత భారత్‌ మూడో స్థానంలో కొనసాగుతుంది.

దేశంలో కరోనా కేసులు వివరాలు (ఆగస్టు 20, ఉదయం 8 గంటల వరకు):

  • దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు : 28,36,925
  • కొత్తగా నమోదైన కేసులు [ఆగస్టు 19–ఆగస్టు 20 (8AM-8AM)] : 69,652
  • నమోదైన మరణాలు : 977
  • డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 20,96,664
  • యాక్టీవ్ కేసులు : 6,86,395
  • మొత్తం మరణాల సంఖ్య : 53,866

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu