తెలంగాణ రాష్ట్రంలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 1724 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 19, బుధవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 97,424 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. బుధవారం నాడు 23,841 శాంపిల్స్ పరీక్షించినట్టుగా పేర్కొన్నారు. కరోనా వలన మరో 10 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 729 కి పెరిగింది. ఇప్పటివరకు 75,186 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 21,509 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 77.17 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.74 (<1%) శాతంగా ఉంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1724):
- జీహెచ్ఎంసీ – 395
- రంగారెడ్డి – 169
- మేడ్చల్ – 105
- కరీంనగర్ – 101
- వరంగల్ అర్బన్ – 91
- నల్గొండ – 67
- సిద్దిపేట – 61
- నిజామాబాద్ – 61
- మంచిర్యాల – 45
- సంగారెడ్డి – 45
- సూర్యాపేట – 44
- పెద్దపల్లి – 43
- ఖమ్మం – 42
- జోగులాంబ గద్వాల్ – 37
- రాజన్న సిరిసిల్ల – 37
- జగిత్యాల – 35
- మెదక్ – 34
- వరంగల్ రూరల్ – 32
- మహబూబ్ నగర్ – 32
- కామారెడ్డి – 32
- వనపర్తి – 28
- మహబూబాబాద్ – 28
- భద్రాద్రి కొత్తగూడెం – 27
- నిర్మల్ – 23
- నాగర్ కర్నూల్ – 22
- ఆదిలాబాద్ – 17
- వికారాబాద్ – 14
- జనగామ – 13
- ములుగు – 11
- యాదాద్రి భువనగిరి – 10
- నారాయణ్ పేట్ – 9
- జయశంకర్ భూపాలపల్లి – 7
- ఆసిఫాబాద్ – 7
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu