దేశంలో కరోనా నుంచి కోలుకున్న 45 లక్షలకు పైగా బాధితులు, ఒకేరోజు 89746 మంది డిశ్చార్జ్

Coronavirus Cases, coronavirus cases india, coronavirus india, coronavirus india live updates, India Corona Updates, India Coronavirus, India Covid-19 Updates, total corona cases in india today, Total Corona Positive Cases in India, total corona positive in india

భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో 83,347 పాజిటివ్ కేసులు నమోదవగా, 1085 మంది మరణించారు. దీంతో సెప్టెంబర్ 23, బుధవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 56,46,010 కు, మరణాల సంఖ్య 90,020 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 45 లక్షలు దాటింది. ఒకే రోజులో 89,746 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఈ రోజు వరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 45,87,613 కు చేరుకుంది. దేశంలో కరోనా రికవరీ రేటు 81.3 శాతం గానూ, మరణాల రేటు 1.6 శాతంగా ఉంది. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9,68,377 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu