దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 14199 కరోనా కేసులు, 83 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,10,05,850 కు, మరణాల సంఖ్య 1,56,385 కు చేరుకుంది. దేశంలో హోమ్ ఐసొలేషన్ మరియు ఆసుపత్రుల్లో 1,50,055 (1.36%) మంది బాధితులు కరోనాకు చికిత్స పొందుతున్నారు. మరోవైపు కొత్తగా 9695 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 1,06,99,410 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 97.22 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.42 శాతంగా ఉంది. ఇక ఫిబ్రవరి 21, ఆదివారం నాటికీ దేశవ్యాప్తంగా 21,15,51,746 కరోనా పరీక్షలు నిర్వహించగా, గత 24 గంటల్లో 6,20,216 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 86.3 శాతం 5 రాష్ట్రాలలోనే:
ఇక కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులలో 86.3 శాతం మహారాష్ట్ర(6971), కేరళ (4070), తమిళనాడు (452), కర్ణాటక (413), పంజాబ్ (348) వంటి 5 రాష్ట్రాలలోనే నివేదించబడ్డాయి. అలాగే గత 24 గంటల్లో హర్యానా, ఆంధ్రప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, ఒడిశా, గోవా, చండీగర్, అస్సాం, మణిపూర్, సిక్కిం, లక్షద్వీప్, త్రిపుర, నాగాలాండ్, లద్దాఖ్, మేఘాలయ, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ అండ్ నికోబర్, దాద్రా మరియు నగర్ హవేలి మరియు డామన్ మరియు డయ్యు వంటి 19 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎటువంటి కరోనా మరణాలు సంభవించలేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ