దేశంలోని పలు రాష్ట్రాల్లో గత 24 గంటల్లో కొత్తగా 102 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,82,206కు చేరుకుంది. ముఖ్యంగా కర్ణాటక (29), కేరళ (20), తమిళనాడు (10), ఒడిశా (9), మహారాష్ట్ర (8) వంటి రాష్ట్రాల్లోనే కరోనా కేసులు నమోదు కొంత ఎక్కువుగా ఉంది. అలాగే మరో 111 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 4,41,49,547 కు చేరుకుంది. ఇక దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.81 శాతంగానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది.
మరోవైపు కరోనా వలన ఎలాంటి మరణాలు సంభవించలేదు, దీంతో మొత్తం మరణాల సంఖ్య 530737 గా ఉంది. ప్రస్తుతం దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి యాక్టీవ్ కేసుల సంఖ్య 1922కు చేరుకుంది. ఇక దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా జనవరి 25, బుధవారం ఉదయం 8 గంటల వరకు 220.32 కోట్లకుపైగా (2,20,32,75,159) వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడ్డాయి. 220.32 కోట్ల మొత్తం వ్యాక్సిన్ డోసులలో 95.16 కోట్ల సెకండ్ డోస్ మరియు 22.59 కోట్ల ప్రికాషన్ డోస్ ఇవ్వబడ్డాయన్నారు. గత 24 గంటల్లో 2,12,020 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE