ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదం సందర్భంగా అక్కడ నోట్ల కట్టలు లభ్యమయ్యాయనే ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ ఆధ్వర్యంలో నిర్వహించిన దర్యాప్తు నివేదికను సుప్రీంకోర్టు తన అధికారిక వెబ్సైట్లో ప్రచురించింది. ఈ నివేదికలో, ఘటనాస్థలంలో సగం కాలిన నోట్ల కట్టలు గుర్తించినట్లు పేర్కొనబడింది. అదనంగా, సంఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
జస్టిస్ యశ్వంత్ వర్మ ఈ ఆరోపణలపై తన వివరణ ఇచ్చారు, ఇది నివేదికలో పొందుపరిచారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రత్యేక విచారణ జరపాలని నిర్ణయించారు. ఈ మేరకు ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ కమిటీలో పంజాబ్-హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శీల్ నాగు, హిమాచల్ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.ఎస్. సంధావాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అను శివరామన్ సభ్యులుగా నియమితులయ్యారు. జస్టిస్ డీకే ఉపాధ్యాయ సుమారు 25 పేజీల నివేదికను సుప్రీంకోర్టు సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నాకు సమర్పించారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం, ఈ అంశంపై మరింత లోతుగా విచారణ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
తనపై వచ్చిన ఆరోపణలను జస్టిస్ యశ్వంత్ వర్మ ఖండించారు. స్టోర్ రూంలో తాను లేదా తన కుటుంబ సభ్యులు ఎటువంటి నగదును ఉంచలేదని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులు ఎవరూ నగదును చూసినట్లుగానీ, ఉంచినట్లుగానీ లేరని ఆయన వివరణ ఇచ్చారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో తాను భార్యతో కలిసి మధ్యప్రదేశ్లో ఉన్నానని పేర్కొన్నారు.
#WATCH | The Supreme Court released the inquiry report filed by Delhi High Court Chief Justice Devendra Kumar Upadhyaya into the controversy relating to High Court Justice Yashwant Varma. In his report, the Delhi High Court Chief Justice said that he is of the prima facie opinion… pic.twitter.com/1xgMh8xWNW
— ANI (@ANI) March 22, 2025