దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం కూడా పెరిగాయి. వరుసగా ఆరో రోజు కూడా ఆయిల్ కంపెనీలు ధరలు పెంచడంతో వినియోగదారులపై రోజురోజుకి భారం మరింతగా పెరుగుతుంది. సోమవారం పెట్రోల్పై లీటరుకు 35 పైసలు, డీజిల్పై లీటరుకు 35 పైసలు ధర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరియు రూపాయి-డాలర్ మారకపు ధరలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వరంగ చమురు శుద్ధి సంస్థలు రోజువారీగా ఇంధన ధరలను సవరిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన మెట్రో నగరాలు, పట్టణాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్టస్థాయికి చేరుకుంటున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ.105 నుంచి రూ.115 వరకు ఉండగా, తాజా పరిస్థితులు చూస్తుంటే రాబోయే రోజుల్లో మరింతగా పెరిగి, సామాన్య ప్రజలపై భారం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిలు ధరలు (లీటరుకు):
- న్యూఢిల్లీ : పెట్రోలు ధర రూ.109.69, డీజిల్ రూ.98.42
- కలకత్తా : పెట్రోలు ధర రూ.110.15, డీజిల్ రూ.101.56
- ముంబయి : పెట్రోలు ధర రూ.115.50, డీజిల్ రూ.106.62
- చెన్నై : పెట్రోలు ధర రూ.106.35, డీజిల్ రూ.102.59
- హైదరాబాద్: పెట్రోలు ధర రూ.114.12, డీజిల్ రూ.107.40
- బెంగళూరు: పెట్రోలు ధర రూ.113.56, డీజిల్ రూ.104.50.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ