దేశంలో గత కొన్ని రోజులుగా పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా తీవ్రత ఎక్కువుగా ఉంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. సెప్టెంబర్ 11, శుక్రవారం నాడు కూడా రికార్డ్ స్థాయిలో 24,886 కరోనా పాజిటివ్ కేసులు, 393 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 10,15,681 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 28,724 కి పెరిగింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి 14,308 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు మొత్తం 7,15,023 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 2,71,566 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు సెప్టెంబర్ 11 నాటికీ మహారాష్ట్రలో 50,72,521 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu