తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు ప్రారంభించే అంశంపై చర్చించేందుకు రెండు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు సోమవారం నాడు హైదరాబాద్లో సమావేశం కానున్నారని వార్తలు వచ్చాయి. అయితే తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందిస్తూ, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల అంశంపై రాష్ట్ర మంత్రుల స్థాయిలో ఎలాంటి సమావేశం లేదని స్పష్టం చేశారు. ఏపీ రవాణా శాఖ మంత్రితో అధికారిక భేటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. కిలోమీటర్ల ఆధారంగా అధికారుల ఒప్పందం కుదిరిన తర్వాతనే మంత్రుల స్థాయిలో సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ అధికారుల స్థాయి సమావేశాలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయని మంత్రి పువ్వాడ అజయ్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu