సెప్టెంబర్ 14 న భేటీ కానున్న తెలుగు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు

Andhra Telangana inter-state bus serbices, AP Telangana Transport Ministers, AP Telangana Transport Ministers Meet, AP Telangana Transport Ministers to Meet on Sep 14 th, APSRTC, APSRTC News, Transport Ministers Meet, Transport ministers of AP Telangana to meet, TSRTC, TSRTC News

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడపడంపై ప్రతిష్టంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై చర్చించేందుకు రెండు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు సెప్టెంబర్ 14, సోమవారం నాడు హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తో పాటుగా ఈ చర్చల్లో రెండు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు, ఇతర ఉన్నత అధికారులు పాల్గొనున్నారు. ఆర్టీసీ సర్వీసులను తిరిగి ప్రారంభించే దిశగా ఈ భేటీలో కీలక చర్చ జరగనున్నట్టు తెలుస్తుంది.

ముందుగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు రాక‌పోక‌లు నిలిచిపోయాయి. ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీల అధికారులు మధ్య విజయవాడలో ఓసారి, హైదరాబాద్ లో ఓసారి చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి ఫలితం రాలేదు. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు సంబంధించిన ఒప్పందంపై చర్చలు సాగాయి. ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ బస్సులు ఇరు రాష్ట్రాల్లో సమాన స్థాయిలో నడపాలనే నేపథ్యంలోనే చర్చలు నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు భేటీ అవుతుండడంతో బస్సు సర్వీసుల ప్రారంభంపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 6 =