మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గతకొన్ని రోజులుగా కరోనా కేసులు, మరణాలు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. మంగళవారం నాడు కూడా కొత్తగా 9927 కరోనా కేసులు, 56 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,38,398 కి చేరగా, మొత్తం మరణాల సంఖ్య 52,556 కు పెరిగింది. అలాగే కొత్తగా 12,182 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న కరోనా బాధితుల సంఖ్య 20,89,294 కు చేరింది. ఇక ప్రస్తుతం మహారాష్ట్రలో 95,322 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
మహారాష్ట్రలో కరోనా కేసుల వివరాలు (మార్చి 9, మంగళవారం నాటికీ):
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య : 1,70,22,315
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 22,38,398
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 20,89,294
- యాక్టీవ్ కేసులు – 95,322
- మార్చి 9 న నమోదైన కేసులు – 9,927
- మార్చి 9 న డిశ్చార్జ్ అయినవారు – 12,182
- మార్చి 9 న నమోదైన మరణాలు – 56
- మొత్తం మరణాల సంఖ్య – 52,556
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ