దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి మరో ముందడుగు పడింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనికా సౌజన్యంతో “కోవిషిల్డ్” పేరుతో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్ సిఓ) నిపుణుల కమిటీ శుక్రవారం నాడు ఆమోదం తెలిపింది. ముందుగా దేశంలో కోవిషిల్డ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతించాలని కోరుతూ సీరం ఇన్స్టిట్యూట్ ఇటీవలే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కు దరఖాస్తు చేసుకుంది.
ఈ నేపథ్యంలో డిసెంబర్ 29, 30 వ తేదీల్లో కోవిషిల్డ్ వ్యాక్సిన్ పై సీరం ఇన్స్టిట్యూట్ సమర్పించిన సమాచారాన్ని నిపుణుల కమిటీ సుదీర్ఘంగా పరిశీలించింది. అనంతరం కోవిషిల్డ్ కు షరతులతో కూడిన అనుమతి ఇవ్వాలంటూ డీసీజీఐకు సిఫార్సు చేస్తూ నిపుణుల కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇక నిపుణల కమిటీ సిఫార్సులకు డీసీజీఐ కూడా ఆమోదముద్ర వేస్తే మార్కెట్ ఆథరైజేషన్, ఉత్పత్తికి సంబందించిన పక్రియనంత పూర్తి చేసుకుని వ్యాక్సిన్ వినియోగం అందుబాటులోకి రానుంది. మరోవైపు ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ కు యూకే ప్రభుత్వం కూడా ఇప్పటికే ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ