ఢిల్లీ పేలుడుపై పీఎం మోదీ సమీక్ష.. ఘటనపై తెలుగు రాష్ట్రాల సీఎంల దిగ్భ్రాంతి

PM Modi Briefed By Amit Shah on Delhi Blast, CM's and Politicians Across India Express Deep Shock

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన భారీ కారు పేలుడు ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఫోన్‌లో మాట్లాడి, పేలుడు అనంతర పరిస్థితిని సమీక్షించారు.

పీఎంకు హోంమంత్రి బ్రీఫింగ్:

సమాచార సేకరణ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ నగర పోలీస్ కమిషనర్, ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) డైరెక్టర్‌తో మాట్లాడి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకున్నారు.

దర్యాప్తు ఆదేశాలు: అమిత్ షా ఆదేశాల మేరకు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ – NSG), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ – NIA), ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) నుండి నిపుణుల బృందాలు ఆధారాలు సేకరించడానికి, దర్యాప్తులో సహాయం చేయడానికి సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

తీవ్ర దర్యాప్తు: ఈ ఘటనపై ఉగ్రవాదంతో సహా అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని, రికవరీ చేసిన నమూనాల విశ్లేషణ పూర్తయ్యే వరకు ఏ కోణాన్నీ తోసిపుచ్చరాదని హోంమంత్రి ఆదేశించారు. ఆయన స్వయంగా క్షతగాత్రులను పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్లారు.

ప్రముఖుల దిగ్భ్రాంతి:

ప్రధాని మోదీ: పేలుడులో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి ప్రధాని మోదీ ఎక్స్ (గతంలో ట్విట్టర్) ద్వారా ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.

రాష్ట్రపతి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం ఈ పేలుడు ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

మరోవైపు ఏ ఘటనపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే ఏపీ హోంమంత్రి పవన్ కళ్యాణ్, బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ సహా పలువురు నాయకులు దీనిపై స్పందించారు. వీరితోపాటు దేశంలోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విపక్ష పార్టీల నాయకులు ఈ దారుణ ఘటనను తీవ్రంగా ఖండించారు.

ఫరీదాబాద్‌లో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు పట్టుబడిన రోజునే ఈ పేలుడు జరగడం పట్ల దేశవ్యాప్తంగా భద్రతా ఆందోళనలు పెరిగాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here