దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 18,346 పాజిటివ్ కేసులు, 263 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,38,53,048 కు చేరుకోగా, మరణాల సంఖ్య 4,49,260 కి పెరిగింది. గత 209 రోజుల్లో నమోదైన రోజువారీ కరోనా కేసుల్లో ఇదే(18,346) తక్కువ. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, మిజోరాం, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక, అస్సాం, తెలంగాణ వంటి 10 రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. మరో 29,639 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 3,31,50,886 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 97.93 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.32 శాతంగా నమోదైంది. దేశంలో ప్రస్తుతం 2,52,902 (0.75%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన 10 రాష్ట్రాలివే (అక్టోబర్ 4 (8am)–అక్టోబర్ 5 (8am)):
- కేరళ – 8850
- మహారాష్ట్ర – 3165
- తమిళనాడు – 1467
- వెస్ట్ బెంగాల్ – 601
- మిజోరాం – 443
- ఆంధ్రప్రదేశ్ – 429
- ఒడిశా – 407
- కర్ణాటక – 397
- అస్సాం – 333
- తెలంగాణ – 207
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ