జూన్ 17 న తెలుగు రాష్ట్రాల సీఎంలతో పీఎం మోదీ వీడియో కాన్ఫరెన్స్, లాక్‌డౌన్ పై నిర్ణయం?

Corona Outbreak, COVID-19, Modi Video Conference, PM Modi, PM Modi Video Conference with Chief Ministers, PM Modi Video Conference with CMs, pm narendra modi, PM Narendra Modi Meeting With All State Ministers, PM Narendra Modi Meeting With CMs, PM Narendra Modi will Interact with State Chief Ministers, Prime Minister Narendra Modi

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, కరోనా కేసుల వివరాలు, కరోనా వ్యాప్తి చెందుతున్న విధానం తదితర అంశాలపై చర్చించేందుకు మరోసారి రాష్ట్రాల/కేంద్రపాలిత సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. జూన్ 16, 17 తేదీల్లో మధ్యాహ్నం 3 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం జరగనుంది.

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడం మొదలయ్యాక సీఎంలతో ప్రధాని మోదీ భేటీ కావడం ఇది ఆరోసారి. దేశవ్యాప్తంగా అన్ని కంటైన్మెంట్ ప్రాంతాల్లో విధించిన లాక్‌డౌన్ గడువు జూన్‌ 30 తో ముగియనుంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ ముగించాలా? లేక ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మరోసారి దేశంలో లాక్‌డౌన్ విధించాలా అనే అంశంపై ఈ సమావేశంలో సీఎంలతో ప్రధాని మోదీ చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశమునట్లు సమాచారం.

జూన్ 16న పీఎం మోదీతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనే రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు:

పంజాబ్, అసోం, కేరళ, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, గోవా, మణిపూర్, నాగాలాండ్, లద్ధాఖ్, పుదుచ్చేరి, అరుణాచల ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం , అండమాన్ నికోబార్ దీవులు, దాద్రానగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ, సిక్కిం, లక్షద్వీప్.

జూన్ 17న పీఎం మోదీతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనే రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు:

మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్నాటక, బీహార్, ఆంధ్రప్రదేశ్, హర్యానా, జమ్మూకాశ్మీర్, తెలంగాణ, ఒడిశా.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu