కేంద్ర ప్రభుత్వం కొత్తగా తయారు చేసే మొబైల్ ఫోన్లలో ‘సంచార్ సాథీ’ యాప్ను ముందుగా ఇన్స్టాల్ చేయడాన్ని తప్పనిసరి చేస్తూ ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకుంది. యాప్పై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ మరియు స్వచ్ఛందంగా డౌన్లోడ్ చేసుకుంటున్న వారి సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టెలికమ్యూనికేషన్ల శాఖ (DoT) ప్రకటించింది.
ప్రీ-ఇన్స్టలేషన్ తప్పనిసరి కాదు..
-
ఉపసంహరణ కారణం: యాప్ను తప్పనిసరి చేస్తూ ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకున్నట్టు టెలికమ్యూనికేషన్ల శాఖ (DoT) ప్రకటించింది. యాప్పై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా ఈ ఆదేశాలను ఉపసంహరించుకున్నట్టు వివరించింది.
-
పెరిగిన డౌన్లోడ్లు: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల తర్వాత, ప్రజలు స్వచ్ఛందంగా యాప్ను డౌన్లోడ్ చేసుకున్న సంఖ్య ఒక్కరోజులోనే పదింతలు పెరిగిందని డీఓటీ తెలిపింది. సంచార్ సాథీ వెబ్సైట్ను ఒకసారి చూసినట్టయితే ఈ వెబ్సైట్కు ఇప్పటివరకూ మొత్తంగా 20 కోట్ల వెబ్సైట్ హిట్లు వచ్చాయి, అలాగే 1.4 కోట్ల మంది ఇప్పటికే ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు.
-
వినియోగదారుల సంఖ్య: ఇప్పటివరకు 1.4 కోట్ల మంది ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారని, గడచిన ఒక్క రోజులోనే 6 లక్షల మంది యూజర్లు యాప్లో రిజిస్టర్ చేసుకున్నారని వివరించింది. వినియోగదారుల సంఖ్య శీఘ్రగతిని పెరుగుతోందని చెప్పింది.
-
ఉద్దేశం: యాప్ను తప్పనిసరి చేయడం వెనుక ఉద్దేశం ఈ ప్రక్రియను వేగవంతం చేయడం, ప్రజలందరికీ తేలిగ్గా తెలుసుకునే అవకాశం కల్పించడం మాత్రమేనని డీఓటీ వివరించింది.
-
తుది నిర్ణయం: సంచార్ సాథీకి పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా, ఇకపై ముందస్తు ఇన్స్టలేషన్ తప్పనిసరి చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం నిర్ణయించినట్టు పేర్కొంది.
Government lifts mandatory pre-installation of Sanchar Saathi App
Refer to press release for details: https://t.co/n3iqBdZzXZ#DoT #Telecommunications #CyberSecurity #DoTForDigitalSafety #SancharSaathi@JM_Scindia @PemmasaniOnX @neerajmittalias @USOF_India @pib_comm @PIB_India… pic.twitter.com/KqVmjO1fF5
— DoT India (@DoT_India) December 3, 2025


































