తమిళనాడు రాష్ట్రంలో కరోనా మరణాలు పెరుగుతున్నాయి. గత కొన్నిరోజులుగా ప్రతి రోజూ 100 మందికి పైగానే ఆ రాష్ట్రంలో కరోనా వలన మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 8, శనివారం ఒక్కరోజే 118 కరోనా మరణాలు, 5883 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,90,907 కి చేరింది. మరోవైపు శనివారం నాటికీ రాష్ట్రంలో 31,55,619 కరోనా పరీక్షలను నిర్వహించి, దేశంలో కరోనా పరీక్షల నిర్వహణలో మొదటి స్థానంలో కొనసాగుతుంది.
తమిళనాడు కరోనా కేసుల వివరాలు (ఆగస్టు 8, శనివారం నాటికీ):
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 2,90,907
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 2,32,618
- యాక్టీవ్ కేసులు – 53,481
- ఆగస్టు 8 న నమోదైన కేసులు – 5883
- ఆగస్టు 8 న డిశ్చార్జ్ అయినవారు – 5043
- ఆగస్టు 8 న నమోదైన మరణాల సంఖ్య – 118
- మొత్తం మరణాల సంఖ్య – 4808
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu






































