కరోనా విజృంభణ: ఒకే రోజు 89 మంది మృతి, 6988 కేసులు నమోదు

Tamilnadu Reports 6988 New Covid-19 Cases and 89 Deaths Today

తమిళనాడు రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జూలై 25, శనివారం నాడు ఒక్కరోజే 6988 కరోనా పాజిటివ్ కేసులు, 89 కరోనా మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఒకే రోజు వ్యవధిలో ఇన్ని కేసులు నమోదవడం ఇదే తొలిసారి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,06,737 కి చేరింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క చెన్నైలోనే 93,537 కేసులు నిర్ధారణ అయ్యాయి. మరోవైపు శనివారం నాటికీ రాష్ట్రంలో 22,87,334 కరోనా పరీక్షలను నిర్వహించినట్టు తెలిపారు.

తమిళనాడు కరోనా కేసుల వివరాలు (జూలై 25, శనివారం):

  • రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 2,06,737
  • డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 1,51,055
  • యాక్టీవ్ కేసులు – 52,273
  • జూలై 25 న నమోదైన కేసులు – 6988
  • జూలై 25 న డిశ్చార్జ్ అయినవారు – 7758
  • జూలై 25 న నమోదైన మరణాల సంఖ్య – 89
  • మొత్తం మరణాల సంఖ్య – 3409

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu