రాష్ట్రంలో కరోనా చికిత్స, మరణాలు తగ్గించడంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక ఆదేశాలు

Andhra Pradesh, AP CM YS Jagan, AP Corona Treatment Updates, AP Coronavirus, AP COVID 19 Cases, AP Total Positive Cases, Corona Treatment, Corona Treatment In AP, YS Jagan Orders over Corona Treatment, YS Jagan Orders over Corona Treatment and Required Drugs

ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. జూలై 24, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం‌ పాజిటివ్ కేసుల సంఖ్య 80858 కు చేరింది. ఈ నేపథ్యంలో కరోనా సోకిన వారికీ మెరుగైన, త్వరితగతిన చికిత్స అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే కరోనా మరణాలను నియంత్రించేందుకు అత్యవసర మందులను పెద్దమొత్తంలో అందుబాటులో ఉంచాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలిచ్చారు. రాష్ట్రానికి చెందిన హెటిరో ఫార్మా త‌యారుచేస్తున్న‌ రెమ్‌డెసివ‌ర్ వంటి డ్ర‌గ్స్‌ను జూలై 25 సాయంత్రానికల్లా 15 వేలకు పైగా డోసులను రాష్ట్రంలో కరోనాకు చికిత్స అందించే వివిధ ఆస్పత్రుల్లో అందుబాటులోకి రానున్నాయి.

సీఎం ఆదేశాలు మేరకు ఆగస్టు మూడోవారం నాటికి మొత్తం దాదాపు 90 వేలకు పైగా రెమ్‌డెసివర్‌ డోసులను సిద్ధం చేయనున్నారు. కరోనా బారిన పడిన వారికీ అత్యవసర పరిస్థితుల్లో 5 నుంచి 7 డోసుల వరకు రెమ్‌డెసివర్‌ను వాడాల్సి వ‌స్తుంది. ఇలా ఒక్కో కరోనా బాధితుడిపై రాష్ట్ర ప్ర‌భుత్వం దాదాపు రూ.35 వేలు ఖ‌ర్చు చేయ‌నుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =