
కొద్ది రోజులుగా పూరీ రత్న భాండాగారంపై ఎంత చర్చ జరిగిందో..గతంలో అనంత పద్మనాభుడి ఖజానా, నేలమాళిగల గురించి కూడా పెద్ద చర్చే జరిగింది. అనంత పద్మనాభుడి ఆలయ నేలమాళిగల్లో లక్షల కోట్ల ఆదాయం, బంగారం ఉందన్న ప్రచారం జరిగింది. అలా దాదాపు 46 ఏళ్ల తర్వాత జులై 14న పూరీ జగన్నాథుని ఆలయంలోని భాండాగారాన్ని తెరిచిన విషయం తెలిసిందే. ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం ఓ అద్భుతమైన ఖజానాగా చెబుతారు. జగన్నాథుని వెలకట్టలేని విలువైన ఆభరణాలను ఐదు చెక్కపెట్టెల్లో ఉంచి, రహస్య గదిలో భద్రపరిచారు. పూర్వం అప్పుడప్పుడు దానిని తెరిచి సంపద లెక్కించేవారు. 1978 తర్వాత దానిని తెరవలేదు. దీంతో ఆ భాండాగారంపై ఎన్నో వివాదాలు కొనసాగాయి. అసలు రత్న భాండాగారం తాళం ఏమైందనే అంశమే మొన్నటి ఎన్నికల్లో అంశమైంది. చివరకు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూరీ జగన్నాథ ఆలయంలోని ఖజానా ఉన్న భాండాగారాన్ని తెరిచారు.
అయితే పూరీ జగన్నాథుడి రత్న భాండాగారంలో ఆభరణాల తరలింపు ప్రక్రియను ప్రస్తుతం అధికారులు నిలిపివేశారు. బయటి రత్న భాండాగారంలోని అన్ని ఆభరణాలను తాము తరలించామని ఆలయ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తెలిపారు. అయితే ఆలయం లోపల రత్న భాండాగారం తెరుచుకోకపోవడతో దాని తాళాలు పగలగొట్టి తెరిచినట్లు అధికారులు చెప్పారు. లోపల రత్న భాండాగారంలో ఆభరణాలన్నిటినీ భద్రంగా అల్మారాలు, లాకర్లలో పెట్టారు. వాటిలోని ఆభరణాలు తరలించడానికి సమయం సరిపోదని తెలిపారు. ఈరోజు అంటే జులై 15న పూరీ జగన్నాథుడి రథయాత్ర తిరుగు ప్రయాణం ఉండటంతో ఆభరణాల తరలింపు ప్రక్రియను ఆపేసినట్లు అధికారులు చెప్పారు.
ఇదే విషయంపై మరోసారి శ్రీక్షేత్ర కార్యాలయంలో భాండాగారం అధ్యయన సంఘం అధ్యక్షుడు జస్టిస్ బిశ్వనాథ్ రథ్ నేతృత్వంలో తాజాగా సమవేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్య గది తలుపులు జులై 18న తెరవడానికి నిర్ణయం తీసుకున్నారు.దీనికోసం ఉదయం 9.51 నుంచి 12.15 గంటల వరకు శుభముహూర్తంగా నిర్ణయించారు. దీంతో దేశమంతా పూరీవేపే ఇప్పుడు ఆసక్తికరంగా చూస్తోంది.
సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన జస్టిస్ రథ్, ఆలయ పాలనాధికారి అరవింద పాఢి.. ఈ నెల 14న భాండాగారంలోని మొదటి రెండు గదుల్లో ఉన్న పురుషోత్తముని సంపదను బయటకు తీసి తాత్కాలిక స్ట్రాంగ్రూంకు తరలించామని చెప్పారు. ఈ తతంగాన్ని అంతా వీడియోగ్రఫీ చేయించామి చెప్పారు. ఇప్పుడు గురువాం ఉదయం రహస్య గదిని తెరిచి, అందులోని సంపదను మరో టెంపరరీ స్ట్రాంగ్రూంలో భద్రపరుస్తామని అన్నారు. ఆ తర్వాత శిధిలావస్థకు చేరుకున్న ఈ భాండాగారాన్ని మరమ్మతుల నిమిత్తం పురావస్తు శాఖకు అప్పగిస్తామని వివరించారు.
ఈ మరమ్మతు పనులు పూర్తయ్యాక సంపదనంతా తిరిగి రహస్య గదికి తీసుకువచ్చి, ఆభరణాల లెక్కింపు కార్యక్రమాన్ని చేపడతామని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఈ రహస్య గది తెరుస్తుండటంతో.. శ్రీక్షేత్రంలోకి భక్తుల ప్రవేశాన్ని గురువారం ఉదయం నుంచి నిలిపివేసినట్లు ఆలయ పాలకమండలి ప్రకటించింది. పూరీ జగన్నాథుడికి గల భాండాగారం ఖజానాలో వజ్రవైడూర్యాలు, కెంపులు, రత్నాలు, స్వర్ణా భరణాలు, వెండి వంటి ఎన్నో విలువైన వస్తువులు ఉంటాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. రాజుల కాలంలో కూడా ఈ భాండాగారంలో స్వామివారికోసం చేయించిన నగలను దాచి పెట్టారని అక్కడి స్జానికులు చెబుతారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE