ఒక్కసారి కరోనా వైరస్ బారినపడిన వ్యక్తుల్లో అది కలుగజేసే దుష్ప్రభావం మాత్రం అధికంగా ఉంటోంది. కరోనా తగ్గిన తర్వాత ఇతర రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. శారీరకంగానే కాకుండా మానసిక ఆరోగ్యంపై కూడా దీని ప్రభావం పడుతోంది. తాజాగా.. వెలుగులోకి వచ్చిన ఒక అధ్యయనం ప్రకారం.. కోవిడ్ వలన త్వరగా వృద్ధాప్యం బారిన పడే అవకాశం ఉందని తెలిసింది. ఇన్ఫెక్షన్ వచ్చిన కొన్ని నెలల తర్వాత మెదడు పనితీరులో తేడాని గుర్తించారు పరిశోధకులు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ అధ్యయన ఫలితాలను నేచుర్ జర్నల్లో ప్రచురించారు.
51 నుండి 81 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులపై చేసిన అధ్యయనంలో ప్రధానంగా వాసనకు సంబంధించిన మెదడు ప్రాంతాలలో సంకోచం మరియు కణజాలం దెబ్బతినటాన్ని కనుగొన్నారు. మేము ప్రజలను భయపెట్టటానికి.. ప్రతి ఒక్కరికి మెదడు దెబ్బతింటుంది అని చెప్పటం లేదు. కానీ, భవిష్యత్తులో దీని వలన వారు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదిరించక తప్పదు అని అధ్యయన బృందం తెలిపింది. సాధారణ వృద్ధాప్యం కన్నా ముందుగానే వృద్ధాప్యం వచ్చే అవకాశం ఉంది అని వారు స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ