ప్రతి ఏటా పెరుగుతున్న మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు

The Height Of Mount Everest Is Increasing Every Year

ప్రపంచంలోనే అతి ఎత్తైన పర్వత శిఖరం.. ఎవరెస్ట్ శిఖరం. ప్రతి ఏటా మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు పెరుగుతూనే ఉంది. నిజానికి కొన్ని కోట్ల సంవత్సరాలుగా ఈ పర్వత శిఖరం ఎత్తు పెరుగుతూనే ఉన్నట్లు సైంటిస్టులు చెబుతున్నారు. ప్రతి ఏటా 2 ఎంఎం ఎత్తు పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రస్తుతం ఈ పర్వత శిఖరం ఎత్తు 8,848.6 మీటర్లుగా ఉంది. సముద్ర మట్టానికి 8.85 కి.మీటర్ల ఎత్తులో మౌంట్ ఎవరెస్ట్ ఉంటుంది. గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో ఈ శిఖరం ఎత్తు వేగంగా పెరుగుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

అయితే మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు పెరగడానికి గల కారణం ఏంటి అని చాలామందికి అనుమానం తలెత్తుతూ ఉంటుంది. అందుకే ఈ విషయాలను యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకులు వెల్లడించారు. భూమిలో నిరంతరం జరిగే అనేక రకాల మార్పుల వల్ల మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు పెరగడానికి కారణమని వారు అంటున్నారు. శిఖరం ఎత్తు పెరగడానికి మరో ప్రధాన కారణం ఓ నది అని కూడా సైంటిస్టులు చెబుతున్నారు.

ఆ నది వల్ల 15 నుంచి 50 మీటర్ల వరకు శిఖరం ఎత్తు పెరిగిందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ నది కారణంగా పెద్దఎత్తున భూమి కోతకు గురవుతోందని.. భూమిపైన ఉన్న రాక్ సాయిల్ కొట్టుకుపోయిందని చెబుతున్నారు. దాంతోనే అక్కడ ఒత్తిడి తగ్గి ఎవరెస్ట్ శిఖరం ఎత్తు పెరుగుతోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఒక్క ఎవరెస్ట్ శిఖరమే కాదు.. దాని పక్కనే ఉన్న ఇతర పర్వత శిఖరాలు కూడా ఇలాగే ఎత్తు పెరుగుతున్నట్లు సైంటిస్టులు గుర్తించారు. ఇది సుదీర్ఘమైన జియోలాజికల్ మార్పుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సుదీర్ఘ కాలంగా భూమి లోపల జరుగుతున్న మార్పుల పరిణామక్రమంలో.. ఎవరెస్ట్ పర్వత శ్రేణి ఎత్తు పెరుగుతోందని సైంటిస్టులు వివరించారు.

నది పరివాహక ప్రాంతంలో కొంచెం కొంచెం భూమి కోతకు గురవుతోందని. దాంతోనే అక్కడ ఒత్తిడి తగ్గిపోతోందని యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకులు వివరించారు . దాని వల్లే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం అయిన మౌంట్ ఎవరెస్ట్ ఏడాదికి 2 మిల్లీమీటర్ల వరకు పెరుగుతోందని పేర్కొన్నారు.