‘అగ్నిపథ్’ పథకం ఆగదని, ఒకవేళ అభ్యర్థులపై ఏవైనా కేసులుంటే సర్వీస్ లోకి తీసుకోవడం కుదరదని త్రివిధ దళాల అధిపతులు స్పష్టం చేశారు. ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్ పథకం కింద సాయుధ దళాలలో రిక్రూట్మెంట్ కోసం త్రివిధ దళాలు షెడ్యూల్ను ప్రకటించాయి. ఈ మేరకు జూన్ 25 నాటికి నౌకాదళ ప్రధాన కార్యాలయం రిక్రూట్మెంట్ కోసం విస్తృత మార్గదర్శకాలను జారీ చేస్తుందని ఇండియన్ నేవీ చీఫ్ ఆఫ్ పర్సనల్ వైస్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి మీడియా సమావేశంలో తెలిపారు. మొదటి బ్యాచ్ రిక్రూట్ర్స్ నవంబర్ 21 నాటికి శిక్షణా కార్యక్రమంలో చేరతారని, ఈ పథకం కింద పురుషులు మరియు మహిళలు ఇద్దరినీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ‘అగ్నివీర్లు’గా నియమించుకుంటామని ఆయన అన్నారు.
ఇండక్షన్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 24 నుండి ప్రారంభమవుతుందని, మొదటి దశ రిక్రూట్మెంట్ కోసం ఆన్లైన్ పరీక్ష ప్రక్రియ జూలై 24 నుండి ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. డిసెంబరు 30 నాటికి మొదటి బ్యాచ్ రిక్రూట్లకు శిక్షణను ప్రారంభించనున్నామని స్పష్టం చేశారు. ఇక మొదటి బ్యాచ్లో 25,000 మంది సిబ్బందిని తీసుకుంటామని, జూలై 1 నుండి వివిధ రిక్రూట్మెంట్ యూనిట్ల ద్వారా తదుపరి నోటిఫికేషన్లు జారీ చేయబడతాయని త్రివిధ దళాల అధిపతులు పేర్కొన్నారు. వీరికి డిసెంబర్ మొదటి మరియు రెండవ వారంలో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని, రెండవ బ్యాచ్ ఫిబ్రవరి 23 నాటికి చేరుతుందని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY