బంగ్లాతో మ్యాచ్ గెలవడం వెనుక కారణం చెప్పిన రోహిత్

Rohit Explains The Reason Behind Winning The Match Against Bangladesh, Rohit Explains The Reason, Reason Behind Winning The Match Against Bangladesh, India Vs Bangla, India Won, Kohli, Rohit Sharma, Test Match, IND Vs Bangladesh, Kohli, Rohit, Team India, Test Series, WTC Final, Test Format, Cricket, Latest Cricket News, Cricket Live Updates, India, BCCI, Sports News, Sports Live Updates, Mango News, Mango News Telugu
Rohit Explains The Reason Behind Winning The Match Against Bangladesh, Rohit Explains The Reason, Reason Behind Winning The Match Against Bangladesh, India Vs Bangla, India Won, Kohli, Rohit Sharma, Test Match, IND Vs Bangladesh, Kohli, Rohit, Team India, Test Series, WTC Final, Test Format, Cricket, Latest Cricket News, Cricket Live Updates, India, BCCI, Sports News, Sports Live Updates, Mango News, Mango News Telugu

బౌలర్ల అసాధారణ ప్రదర్శనతోనే బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. పిచ్ అనుకూలంగా లేకపోయినా భారత బౌలర్లు రాణిస్తున్నారని కొనియాడాడు. కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.

ఫలితం అసాధ్యమనిపించిన ఈ మ్యాచ్‌లో టీమిండియా దూకుడుతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. బౌలర్ల అసాధారణ ప్రదర్శన, బ్యాట్స్‌మెన్ రిస్క్ కారణంగానే విజయం సాధించామని అన్నాడు. ఫలితంగా 100 పరుగులకే ఔటైనా దూకుడుగా ఆడామని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. గంభీర్‌తో కలిసి పనిచేయడంపై రోహిత్ ఆసక్తికరమై ప్రకటన చేశాడు.

“జీవితంలో ముందుకు సాగాలి.. కొన్నిసార్లు వేర్వేరు వ్యక్తులతో కలిసి పని చేయాల్సి ఉంటుంది. రాహుల్‌ (ద్రావిడ్‌) భాయ్‌ వీడ్కోలు పలికారు. అయితే మేము అతనితో అద్భుతమైన సమయాన్ని గడిపాము. అతను దూరంగా ఉన్నప్పటికీ, మేము జట్టుగా పురోగమిస్తున్నాము. గౌతమ్‌ గంభీర్‌తో కలిసి ఆడాను, ఇది అతని కోచింగ్‌ కెరీర్‌కు గొప్ప ప్రారంభం అన్నాడు.

“రెండున్నర రోజుల ఆట తర్వాత, ఫలితం సాధించడం గురించి మేము బాగా ఆలోచించాము. నాలుగో రోజు బంగ్లాదేశ్‌ను వీలైనంత త్వరగా అవుట్ చేయాలనుకున్నాము. మేము వారిని పరుగులు చేయాలనుకోలేదు. “పిచ్ బౌలర్లకు ఏమాత్రం ఉపయోగపడలేదు. కానీ, మా బౌలర్లు అనూహ్యంగా రాణించారు. 100-150 పరుగులకు ఔట్ అయినప్పటికీ బ్యాట్స్‌మెన్ రిస్క్ తీసుకొని దూకుడుగా ఆడారు. మేము విజయం సాధించాలంటే, మేము రిస్క్ తీసుకోవాలని భావించాము.

ఆకాష్‌ దీప్‌కు చాలా దేశవాళీ క్రికెట్‌ అనుభవం ఉంది. “అతను (ఆకాశ్ దీప్) మా అంచనాలకు మించి రాణించాడు. అతను సుదీర్ఘ మెళుకువలతో అలసిపోకుండా బౌలింగ్ చేశాడు. అవకాశం దొరికితే టెస్ట్ క్రికెట్‌లో విజృంభించే బౌలర్లను సిద్ధం చేయాలనుకుంటున్నాము. బెంచ్ బలం పెంచుకోవాలనుకుంటున్నాము. బిజీ షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లు గాయాల పాలు అయ్యే అవకాశ ఉంది.

95 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లకు 98 పరుగులు చేసి విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (8), శుభ్‌మన్ గిల్ (6) విఫలమయ్యారు. అయితే  జైస్వాల్ (45 బంతుల్లో 8 ఫోర్లు, 51 సిక్సర్లు) అర్ధ సెంచరీతో మెరిశాడు. విన్నింగ్ షాట్ కొట్టే ప్రయత్నంలో జైస్వాల్ ఔటయ్యాడు. విరాట్ కోహ్లీ (25 నాటౌట్) రిషబ్ పంత్ సహకారంతో భారత జట్టును విజయతీరాలకు చేర్చాడు.