బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో విరాట్ కోహ్లీ సరికొత్త మైలురాయిని చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 27000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. తద్వారా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు.
35 ఏళ్ల విరాట్ కోహ్లీ తన 594వ ఇన్నింగ్స్లో 27 వేల పరుగులు పూర్తి చేశాడు. అయితే, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ 2007లో తన 623వ ఇన్నింగ్స్లో 27000 పరుగులు పూర్తి చేశాడు. దీనితో సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్ మరియు కుమార సంగక్కరల ఎలైట్ లిస్ట్లో విరాట్ కోహ్లీ చేరాడు.
విరాట్ కోహ్లీ గత దశాబ్ద కాలంగా టెస్టులు, వన్డేలు మరియు T20లతో సహా మూడు ఫార్మాట్లలో చాలా స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఫలితంగా అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 25000 పరుగులు, 26000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఇప్పుడు 27000 పరుగులు పూర్తి చేశాడు. కోహ్లీ ఫిబ్రవరి 2023లో 25000 పరుగులు మరియు అక్టోబర్ 2023లో 26000 పరుగులు పూర్తి చేశాడు. దీంతో విరాట్ కోహ్లీ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్గా నిలిచాడు.
అత్యంత వేగంగా 27000 పరుగులు చేసిన బ్యాట్స్మెన్
విరాట్ కోహ్లీ: 594* ఇన్నింగ్స్లు
సచిన్ టెండూల్కర్: 623 ఇన్నింగ్స్లు
కుమార సంగక్కర: 648 ఇన్నింగ్స్లు
రికీ పాంటింగ్: 650 ఇన్నింగ్స్లు