RCB కొత్త కెప్టెన్: భాద్యతలు స్వీకరించనున్నరజత్ పటిదార్‌.. కోహ్లీ మద్దతు

Who Is RCBs New Captain Franchises Bold Decision, Who Is RCBs New Captain, RCB New Captain, New Captain To RCB, IPL 2025 RCB Captain, Royal Challengers Bangalore, Faf du Plessis, Rajat Patidar, RCB, Virat Kohli, IPL 2025 Breaking News, IPL Franchises, IPL Retained Players List 2025, IPL 2025, Dhoni, Rohit Sharma, kohli, BCCI, India, Latest IPL News, IPL Live Updates, Mango News, Mango News Telugu

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2025 సీజన్ కోసం కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్ డైనమిక్ మిడిలార్డర్ బ్యాటర్ రజత్ పటిదార్‌ను కెప్టెన్‌గా నియమించింది. బెంగళూరులోని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్‌లో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

గత సీజన్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన ఫాఫ్ డుప్లెసిస్‌ను ఈ సీజన్ కోసం కొనసాగించకూడదని ఫ్రాంచైజీ నిర్ణయించుకుంది. వేలంపాటకు ముందు అతన్ని రిలీజ్ చేయడంతో, ఆర్సీబీ కొత్త కెప్టెన్‌ కోసం అన్వేషణ ప్రారంభించింది. కొంతకాలం విరాట్ కోహ్లీ పేరు వినిపించినప్పటికీ, ఆ నిర్ణయం కార్యరూపం దాల్చలేదు.

రజత్ పటిదార్ కెప్టెన్సీ – కొత్త దిశలో ఆర్సీబీ 

రజత్ పటిదార్‌ దేశవాళీ క్రికెట్‌లో తన ప్రతిభను నిరూపించుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ జట్టును ఫైనల్‌ దాకా తీసుకెళ్లిన అనుభవం అతనికి కలిసి వచ్చింది. 2021లో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన పటిదార్‌ పేస్, స్పిన్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొనే నైపుణ్యాన్ని కనబర్చాడు. RCB తరఫున 27 మ్యాచ్‌లు ఆడి, 158.85 స్ట్రైక్ రేట్‌తో 799 పరుగులు సాధించాడు. మెగా వేలానికి ముందు రిటైన్ చేసిన ఆటగాళ్లలో అతనూ ఒకడు. విరాట్ కోహ్లీ, యష్ దయాల్‌తో పాటు అతనిని కూడా ఫ్రాంచైజీ రిటైన్ చేసింది.

కొత్త కెప్టెన్‌పై విరాట్ కోహ్లీ రియాక్షన్
విరాట్ కోహ్లీ రజత్ పటిదార్‌కు శుభాకాంక్షలు తెలియజేశాడు. “ఆర్సీబీకి చాలా మంది కెప్టెన్లుగా వ్యవహరించారు. గత కెప్టెన్లలాగే రజత్‌ కూడా జట్టును ముందుకు తీసుకెళ్తాడని నమ్ముతున్నా. కెప్టెన్సీ ఒక పెద్ద బాధ్యత. నేను కూడా అనేక ఏళ్ల పాటు కెప్టెన్‌గా ఉన్నాను. ఫాఫ్ గత రెండు సీజన్లలో జట్టును ముందుండి నడిపించాడు. ఇప్పుడు రజత్ టీమ్‌ను మరింత మెరుగ్గా నడిపిస్తాడని ఆశిస్తున్నా” అని కోహ్లీ వ్యాఖ్యానించాడు.

RCB డైరెక్టర్‌ బోబట్ ఏమన్నారంటే?
RCB డైరెక్టర్‌ బోబట్ మాట్లాడుతూ, “విదేశీ ఆటగాళ్ల స్థానంలో భారత ఆటగాడిని కెప్టెన్‌గా నియమించాలనే నిర్ణయానికి వచ్చాం. విరాట్ కోహ్లీ పేరు కూడా చర్చకు వచ్చింది. అభిమానులు కోహ్లీని కెప్టెన్‌గా చూడాలనుకున్నారు. కానీ, అతను గ్రౌండ్‌లో ఎప్పుడూ లీడర్‌గానే ఉంటాడు. గత సీజన్‌లోనూ ఫాఫ్‌ ఉన్నప్పటికీ క్లిష్ట పరిస్థితుల్లో కోహ్లీనే ముందుకు వచ్చాడు. రజత్ ఇప్పుడు ఆ జట్టును కొత్త దిశలో నడిపించేందుకు సిద్ధంగా ఉన్నాడు” అని అన్నారు.

ఈ నిర్ణయం RCB ఫ్రాంచైజీకి కొత్త వర్గాన్ని అందించనుంది. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ వంటి దిగ్గజాలు జట్టును నడిపించగా, ఇప్పుడు యువ ఆటగాడికి ఆ బాధ్యత అప్పగించారు. 2025 ఐపీఎల్ సీజన్‌లో రజత్ పటిదార్‌ కొత్త నాయకుడిగా ఎలా రాణిస్తాడో చూడాలి.