భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా చెన్నై లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన రెండో టెస్టులో భారత్ జట్టు 317 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్ ప్రస్తుతానికి 1-1 తో సమం అయింది. ముందుగా 53/3 వద్ద నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు 164 పరుగులకే ఆలౌట్ అయింది.
భారత్ నిర్దేశించిన 482 పరుగుల లక్ష్య సాధనలో ఇంగ్లాండ్ ఏ దశలోనూ పట్టు సాధించలేకపోయింది. భారత్ స్పిన్ బౌలర్లు అశ్విన్, అక్షర్ పటేల్ దాటికి ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ వెంట వెంటనే పెవిలియన్ బాటపట్టారు. కెప్టెన్ జో రూట్ (33), డానియల్ లారెన్స్(26), మొయిన్ అలీ (43) పరుగులతో కొంత పోరాటం చేసినప్పటికీ భారత్ బౌలర్ల ముందు నిలువలేకపోయారు. దీంతో 164 పరుగులకే ఆలౌట్ అయి ఇంగ్లాండ్ జట్టు పరాజయం పాలయింది. భారత్ బౌలర్లు అక్షర్ పటేల్ 5, అశ్విన్ 3, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లుతో రాణించారు. ఈ టెస్టులో రెండో ఇన్నింగ్స్ లలో కలిపి 8 వికెట్లు, 119 పరుగులు చేసిన బౌలింగ్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ఇక ఇరు జట్ల మధ్య మూడో టెస్టు ఫిబ్రవరి 24 నుంచి అహ్మదాబాద్ లోని సర్దార్ పటేల్ స్టేడియంలోనే జరగనుంది.
భారత్–ఇంగ్లాండ్ రెండో టెస్టు వివరాలు:
భారత్ తోలి ఇన్నింగ్స్: 337-10
- రోహిత్ శర్మ (161), అజింక్య రహానే (67), రిషబ్ పంత్ (58)
- మొయిన్ అలీ 4/128 ,ఓలి స్టోన్ 3/47, జాక్ లీచ్ 2/78
ఇంగ్లాండ్ తోలి ఇన్నింగ్స్: 134-10
- బెన్ ఫ్లోక్స్ (42), ఓలి పోప్ (22)
- అశ్విన్ 5/43, ఇషాంత్ శర్మ 2/22, అక్షర్ పటేల్ 2/40
భారత్ రెండవ ఇన్నింగ్స్: 286-10
- అశ్విన్ (106), విరాట్ కోహ్లీ(67), రోహిత్ శర్మ (26)
- జాక్ లీచ్ 4/100, మొయిన్ అలీ 4/98
ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్: 164-10
- మొయిన్ అలీ (43), జో రూట్ (33), డానియల్ లారెన్స్(26)
- అక్షర్ పటేల్ 5/60, అశ్విన్ 3/53, కుల్దీప్ యాదవ్ 2/25
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ