భారత క్రికెట్ జట్టు కెప్టెన్, స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ గురువారం కీలక ప్రకటన చేశాడు. భారత టీ20 కెప్టెన్ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించాడు. యూఏఈ, ఒమన్ లలో త్వరలో జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీ20 కెప్టెన్ పదవికి వీడ్కోలు పలకనున్నట్లు తెలిపాడు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేశాడు. ఈ నిర్ణయంపై ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి జై షా, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి, సెలెక్టర్లకు సమాచారం ఇచ్చినట్లు తెలిపాడు. అలాగే కోచ్ రవిశాస్త్రి, కీలక ఆటగాడు రోహిత్ శర్మ, జట్టు సభ్యులు, సన్నిహితులతో చర్చించినట్టు చెప్పాడు. గత 8-9 సంవత్సరాలుగా పని భారం, 5-6 సంవత్సరాలుగా 3 ఫార్మాట్లకు (టెస్టు, వన్డే, టీ20) కెప్టెన్ గా వ్యవహరించడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని టెస్టుల్లో, వన్డేల్లో కెప్టెన్ గా పూర్తిస్థాయిలో సన్నద్ధత కోసం ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు.
🇮🇳 ❤️ pic.twitter.com/Ds7okjhj9J
— Virat Kohli (@imVkohli) September 16, 2021
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ