తెలంగాణలో కొత్తగా 237 మందికి కరోనా నిర్ధారణ, 185 కి చేరిన మరణాలు

Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, Coronavirus Live Updates, Coronavirus updates Live, COVID-19, India COVID 19 Cases, telangana, Telangana Coronavirus, Telangana Coronavirus Deaths, Total COVID 19 Cases

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా జీహెఛ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 13, శనివారం సాయంత్రం 5 గంటల నుండి జూన్ 14, ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో కొత్తగా 237 కరోనా పాజిటివ్ కేసులు, 3 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 237 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4974 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. మొత్తం కరోనా బాధితుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు, విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్య 449 కి చేరింది . అలాగే కొత్తగా నమోదైన 3 మరణాలతో కలిపి ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 185 కి పెరిగినట్టు తెలిపారు.

కొత్తగా రాష్ట్రంలో జీహెచ్‌ఎంసీ ఏరియాలో 195 కేసులు, మేడ్చల్ లో 10, రంగారెడ్డి‌ జిల్లాలో 8, సంగారెడ్డిలో 5, మంచిర్యాలలో 3, మహబూబ్ నగర్, వరంగల్ అర్బన్, కరీంనగర్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలలో 2 కేసుల చొప్పున, సిరిసిల్ల, మెదక్, ఆదిలాబాద్, సిద్ధిపేట, యాదాద్రి, వరంగల్ రూరల్ జిల్లాలలో ఒక్కోకేసు చొప్పున మొత్తం 237 కరోనా కేసులు నిర్ధారణ అయినట్టు ప్రకటించారు. కాగా ఇప్పటికే ఈ వైరస్ నుంచి కోలుకుని 2377 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 2412 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu