తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే

CM Revanth Reddy Conducts Aerial Survey of Cyclone-Hit Warangal and Husnabad

‘మొంథా’ తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లోని పరిస్థితిని అంచనా వేయడానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈరోజు (శుక్రవారం) ఏరియల్ సర్వే నిర్వహించారు. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు హుస్నాబాద్ నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాలను, భారీగా దెబ్బతిన్న పంట పొలాలను ఆయన హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు.

భారీ వర్షాలు, వరదల కారణంగా వరంగల్‌లో రోడ్లు, కాలనీలు నీట మునగడం, వరి, పత్తి వంటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాల్లో తేలింది. వాతావరణం అనుకూలించకపోవడంతో గురువారం నాటి సర్వే వాయిదా పడగా, ఈరోజు సీఎం ఏరియల్ సర్వే పూర్తి చేసి, హనుమకొండలోని పునరావాస కేంద్రాలలో బాధితులతో మాట్లాడారు.

అధికారులకు కీలక ఆదేశాలు:

వరద నష్టంపై జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో సీఎం ఆదేశాలు జారీ చేశారు.

  • సహాయక చర్యలు: సహాయక చర్యలను ‘యుద్ధ ప్రాతిపదికన’ చేపట్టాలని, వరదల్లో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.
  • పంట నష్టంపై నివేదిక: రైతుల ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వెంటనే ధాన్యాన్ని గోదాములు లేదా మిల్లులకు తరలించాలని సూచించారు. అలాగే, పంట నష్టంపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశం.
  • అప్రమత్తత: జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులు క్షేత్ర స్థాయిలో ఉండి, ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు.

కాగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here