గాంధీ కుటుంబంపై కేసులకు భయపడేది లేదు – సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy Says, We Are Not Afraid of Cases Against Sonia and Rahul Gandhi

గాంధీ కుటుంబంపై కేసులు పెట్టినా తాము భయపడేదిలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ విచక్షణారహిత వ్యాఖ్యలు, కేసులు పెడుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. న్యాయపరంగా వారు ఏ తప్పూ చేయలేదని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఒత్తిడులు, భయపెట్టించే ప్రయత్నాలు పనిచేయవని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ న్యాయపాలనకు కట్టుబడి ఉంటుందని, గాంధీ కుటుంబం దేశానికి చేసిన సేవలను ప్రజలు గుర్తుంచుకున్నారని కూడా సీఎం పేర్కొన్నారు.

గాంధీ కుటుంబానికి అండగా..
  • కేసులపై స్పష్టత: కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలపై కేసులు పెడితే భయపడేది లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

  • నేషనల్ హెరాల్డ్: ఎప్పుడో మూతపడిన నేషనల్ హెరాల్డ్ పత్రిక సిబ్బందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకపోవడంతో, మంచి ఆలోచనతో వారికి ఆర్థిక సహాయం అందించడానికి గాంధీ కుటుంబం ముందుకు వచ్చిందని ఆయన గుర్తు చేశారు. పత్రికను పునరుద్ధరించాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ నేతలు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా ఉన్నారని వివరించారు.

  • త్యాగం: దేశం కోసం గాంధీ కుటుంబం చేసిన త్యాగాలను ఆయన ఈ సందర్భంగా సోదాహరణంగా వివరించారు.

రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలు
  • ఉస్మానియా అభివృద్ధి: డిసెంబర్ 7న ఉస్మానియా యూనివర్సిటీకి (OU) వెళ్తామని సీఎం తెలిపారు. ఓయూ అభివృద్ధికి ఎంత ఖర్చు అయినా నిధులు కేటాయించి, యూనివర్సిటీని ప్రపంచస్థాయిలో నిలబెడతామని ప్రకటించారు.

  • గ్లోబల్ సమ్మిట్: డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నామని, 9వ తేదీన తెలంగాణ – 2047 పాలసీ డాక్యుమెంట్‌ను ఆవిష్కరిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి దిగ్గజ నేతల సలహాలు తీసుకున్నామని పేర్కొన్నారు.

  • కోర్ అర్బన్ క్యూరింగ్: కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు (ORR) బయటకు తరలిస్తున్నామని స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, పరిశ్రమల తరలింపు తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని వివరించారు. భూమి అందుబాటులోకి రావడానికి కూడా ఈ తరలింపు ఉపయోగపడుతుందని తెలిపారు.

బీఆర్ఎస్‌పై విమర్శలు
  • ఎయిర్‌పోర్టులు: గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు ఒక్క ఎయిర్‌పోర్టును కూడా తేలేకపోయిందని సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.

  • అభివృద్ధి: తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 4 ఎయిర్‌పోర్టులు తీసుకొచ్చామని, సంక్షోభంలో ఉన్న తెలంగాణను సంక్షేమం దిశగా తీసుకెళ్తున్నామని వివరించారు.

  • ఆర్థిక లక్ష్యం: 2034 నాటికి తెలంగాణను వన్‌ ట్రిలియన్‌ డాలర్ల (One Trillion Economy) ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు.

డీసీసీలకు వార్నింగ్, మహిళా సంక్షేమం
  • మహిళలకు చీరలు: కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దుతామని, కోటి మంది మహిళలకు చీరలు అందించడమే తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.

  • వార్నింగ్: డిసెంబర్ నెలాఖరులోగా మహిళలందరికీ చీరలు అందకపోతే, ఫిర్యాదులు వస్తే అందుకు డీసీసీలదే బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here