తెలంగాణలో కొత్తగా 191 కరోనా కేసులు, 156 కి చేరిన మరణాలు

Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, Coronavirus Live Updates, Coronavirus updates Live, COVID-19, India COVID 19 Cases, telangana, Telangana Coronavirus, Telangana Coronavirus Deaths, Total COVID 19 Cases

తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా 191 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 191 కేసులతో కలిపి జూన్ 10, బుధవారం సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4111 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. మొత్తం కరోనా బాధితుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు, విదేశాల నుంచి వచ్చిన వారు 448 మంది ఉన్నారు. అలాగే కొత్తగా నమోదైన 8 మరణాలతో కలిపి ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 156 కి చేరినట్టు తెలిపారు.

కొత్తగా రాష్ట్రంలో జీహెచ్‌ఎంసీ ఏరియాలో 143 కేసులు, మేడ్చల్ లో 11, సంగారెడ్డిలో 11, రంగారెడ్డి‌ జిల్లాలో 8, మహబూబ్ నగర్ లో 4, జగిత్యాల, మెదక్ జిల్లాలలో 3 కేసుల చొప్పున, నాగర్ కర్నూల్, కరీంనగర్ జిల్లాలలో 2 కేసులు చొప్పున, నిజామాబాద్, వికారాబాద్, నల్గొండ, సిద్దిపేట జిల్లాలలో ఒక్కోకేసు చొప్పున మొత్తం 191 కరోనా కేసులు నిర్ధారణ అయినట్టు ప్రకటించారు. కాగా ఇప్పటికే ఈ వైరస్ నుంచి కోలుకుని 1817 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 2138 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu