త్వరలోనే మాజీ చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్కు పోలీసులు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. అవసరమైన కసరత్తు ఇప్పటికే వేగవంతం అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎంక్వయిరీకి హాజరుకావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొనడానికి ఇన్వెస్టిగేషన్ టీమ్ రెడీ అవుతోంది. అయితే ఈ నోటీసులు ఎప్పుడు జారీ అవుతాయనే స్పష్టతను బయటకు వెల్లడించకపోయినా ..ఏ రోజైనా నోటీసులు ఇచ్చే అవకాశమున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి.
కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ రవి కానూరి జులై 26న పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో సోమేష్ కుమార్ను ఏ-5గా చేరుస్తూ ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ఐపీసీలోని 406, 409, 120-బి సెక్షన్లతో పాటు ఐటీ యాక్టులోని సెక్షన్ 65 కింద సోమేష్ కుమార్ మీద అభియోగాలను నమోదు చేశారు. ప్రాథమిక విచారణ చేపట్టిన ఇన్వెస్టిగేషన్ బృందం.. సోమేష్ కుమార్కు నోటీసులు ఇచ్చి నుంచి వాంగ్మూలాన్ని రికార్డు చేసే అవకాశముందని తెలుస్తోంది.
కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ హోదాలో ఉన్న అప్పటి చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ జీఎస్టీ రిటర్న్స్ విషయంలో ఉద్దేశపూర్వకంగా తెలంగాణ ఖజానాకు నష్టం చేకూర్చే తరహాలో నిర్ణయాలు తీసుకున్నట్లు.. ఆయనపై జాయింట్ కమిషనర్ ఫిర్యాదు చేశారు. సుమారు రూ.1,400 కోట్ల వరకూ తెలంగాణ ఖజానాకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.
కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో పనిచేస్తున్న అడిషనల్ కమిషనర్ ఎస్వీ కాశీ విశ్వేశ్వరరావు అలాగే డిప్యూటీ కమిషనర్ శివరామ్ప్రసాద్, సాఫ్ట్వేర్ రూపొందించిన హైదరాబాద్ ఐఐటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్బాబుతో పాటు సాఫ్ట్వేర్ను మెయింటెనెన్స్ చేసే ప్లియాంటో టెక్నాలజీస్ రిప్రజెంటివ్లను ఏ-1 నుంచి ఏ-4గా ఆ ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. త్వరలోనే సోమేశ్కుమార్తో పాటు వీరందరికీ పోలీసులు నోటీసులు జారీచేసి వివరణ తీసుకునే అవకావమున్నట్లు తెలుస్తోంది.
సుమారు 75 కంపెనీలను సాఫ్ట్వేర్ ద్వారా హిడెన్ లిస్టులో పెట్టి.. ఆ కంపెనీలు సమర్పించాల్సిన జీఎస్టీ రిటర్న్స్ వివరాలు అధికారులకు అందుబాటులో లేకుండా చేయడంలో సోమేశ్ కుమార్ ప్రమేయం కూడా ఉందని, సోమేష్ కుమార్ ఆదేశాలతోనే ఈ మార్పులు చేసినట్టు శోభన్బాబుతో సహా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు పేర్కొన్నట్టు ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు.
ఆయా కంపెనీల జీఎస్టీ రిటర్న్స్ వివరాలు సాఫ్ట్వేర్లో కనిపించకపోవడంతో.. కమర్షియల్ ట్యాక్స్ డిపార్టుమెంటులోని అధికారులు లాస్ట్ డేట్ లోగా ఆ కంపెనీల నుంచి ట్యాక్స్ను వసూలు చేయలేకపోయారని, దీనివల్ల ఏకంగా ఖజానాకు రూ.1,400 కోట్ల వరకూ నష్టం వాటిల్లినట్టు అసిస్టెంట్ కమిషనర్ రవి కానూరి తన ఫిర్యాదులో పేర్కొన్న విషయాన్ని ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు.
మొత్తంగా తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చి పెట్టాల్సిన పొజిషన్లో ఉన్న సోమేశ్ కుమార్.. ఇలాంటి అవకతవకలకు పాల్పడి.. తెలంగాణ ఖజానాకు నష్టం చేకూర్చారంటూ పోలీసుల ఇన్వెస్టిగేషన్ చేస్తుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.