తెలంగాణ లోకాయుక్తను, ఉపలోకాయుక్తను ప్రభుత్వం నియమించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని కమిటీ డిసెంబర్ 19, గురువారం నాడు ప్రగతి భవన్ లో సమావేశమై లోకాయుక్త, ఉపలోకాయుక్త పేర్లను నిర్ణయించింది. లోకాయుక్తగా జస్టిస్ సీ.వి.రాములు, ఉపలోకాయుక్తగా వి.నిరంజన్ రావు పేర్లను కమిటీ సిఫారసు చేసింది. కమిటీ చేసిన సిఫారసులను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు. కమిటీలో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, అసెంబ్లీ, మండలిలో విపక్ష నాయకులు పాషా ఖాద్రీ, జాఫ్రీ ఉన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను కూడా ప్రభుత్వం నియమించింది. ఛైర్మన్ గా జి.చంద్రయ్య, సభ్యులుగా ఎన్.ఆనందరావు, మొహమ్మద్ ఇర్ఫాన్ మోయినుద్దీన్ లను నియమించింది.
[subscribe]