తెలంగాణ రాష్ట్రంలో శనివారం నాడు 41,646 శాంపిల్స్ పరీక్షించగా, 873 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 2,63,526 కి చేరింది. అలాగే కరోనాతో మరో నలుగురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1430 కి పెరిగింది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 152, మేడ్చల్- మల్కాజ్ గిరిలో 78, రంగారెడ్డిలో 71, భద్రాద్రి కొత్తగూడెంలో 58, వరంగల్ అర్బన్ లో 56, నల్గొండలో 47, కరీంనగర్ లో 44, జగిత్యాలలో 36 నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు వివరాలు (నవంబర్ 21, రాత్రి 8 గంటల వరకు) :
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 2,63,526
- కొత్తగా నమోదైన కేసులు : 873
- నమోదైన మరణాలు : 4
- రికవరీ అయిన వారి సంఖ్య : 2,50,453
- కరోనా రికవరీ రేటు: 94.03%
- యాక్టీవ్ కేసులు: 11,643
- హోమ్/ఇన్స్టిట్యూషనల్ ఐసోలేషన్లో ఉన్నవారి సంఖ్య: 9,345
- నమోదైన మొత్తం మరణాల సంఖ్య: 1430
- కరోనా మరణాల రేటు: 0.54%
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ