తెలంగాణలో ముఖ్యంగా జీహెఛ్ఎంసీ పరిధిలో రోజురోజుకి కరోనా ప్రభావం పెరుగుతుంది. దీంతో ప్రతిరోజూ వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ బీ. నాగేందర్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. హాస్పిటల్లో కరోనా లక్షణాలు కనిపించని ఓ వ్యక్తికి వైద్యం చేసిన సమయంలో డాక్టర్ నాగేందర్ కు కరోనా సోకినట్లుగా నిర్ధారించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘంలో సీనియర్ సభ్యులైన నాగేందర్, కరోనా చికిత్స కోసం 1500 కి పైగా బెడ్స్ తో ఏర్పాటు చేసిన గచ్చిబౌలిలోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్)కు సంబంధించిన పనులను కూడా పర్యవేక్షిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu