గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు నామినేషన్ దాఖలు పక్రియ నవంబర్ 20 తో ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో నవంబర్ 21, శనివారం నాడు రాష్ట్ర ఎన్నికల సంఘం నామినేషన్ల పరిశీలన చేపట్టింది. ఈ ఎన్నికలకు మొత్తం 1,893 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, వీటిల్లో 1,825 మంది నామినేషన్లు నిబంధనలకు అనుగుణంగా ఉండటంతో వాటిని ఆమోదించినట్టుగా అధికారులు వెల్లడించారు. ఇక నామినేషన్ పత్రాలలో పొరపాట్లు ఉండడంతో 68 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించినట్టు తెలిపారు. ఆదివారంతో నామినేషన్ ఉపసంహరణ గడువు ముగియనుంది. అనంతరం బరిలో ఉండే తుది అభ్యర్థుల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. మరోవైపు జీహెచ్ఎంసీలో ప్రధాన రాజకీయ పార్టీలన్ని ప్రచారంలో దూసుకెళ్తున్నాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ