లోటస్‌ పాండ్‌లో అభిమానులతో వైఎస్ షర్మిల ఆత్మీయ సమావేశం

Hyderabad, Lotus Pond, Lotus Pond in Hyderabad, Mango News, YS Sharmila, YS Sharmila at Lotus Pond in Hyderabad, YS Sharmila Meeting, YS Sharmila Meeting in Hyderabad, YS Sharmila Meeting with YSR Fans, YS Sharmila Meeting with YSR Fans at Lotus Pond, YSR Fans, YSR Fans at Lotus Pond, YSR Fans at Lotus Pond in Hyderabad

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి‌ సోదరి వైఎస్ షర్మిల మంగళవారం నాడు హైదరాబాద్‌ లోని లోటస్‌ పాండ్‌లోని తన నివాసంలో వైఎస్ఆర్ అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో వైఎస్‌ఆర్ తో అనుబంధం ఉన్న నాయకులకు, ఆయనతో కలిసి పని చేసిన పలువురికి ఈ ఆత్మీయ సమావేశానికి హాజరుకావాలని వైఎస్ షర్మిల తరఫు ప్రతినిధులు ఫోన్‌ చేసి ఆహ్వానించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల నుండి నాయకులు, అభిమానులు లోటస్ పాండ్ కు చేరుకున్నారు. అలాగే వైఎస్ షర్మిల ఇంటి సమీపంలో అభిమానులు భారీగా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు జరుగుతున్న ఆత్మీయ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం అనంతరం తన భవిష్యత్ కార్యాచరణపై వైఎస్ షర్మిల ప్రకటించే అవకాశం ఉందని ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ ఊహాగానాలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ అంశాలకు సంబంధించి వైఎస్ షర్మిల లేదా ఆమె ప్రతినిధుల నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ